చిరంజీవి చిన్నల్లుడుగా ‘విజేత’ మూవీతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ మొదటి ప్రయత్నంలో నిరాశ ఎదురైంది. అయినా నిరాశ పడకుండా తన రెండవ సినిమా ‘సూపర్ మచ్చి’ మూవీ షూటింగ్ ను ఈ కరోనా వ్యతిరేక పరిస్థితులలో కూడ కొనసాగిస్తూ యాక్టింగ్ పై తనకు ఉన్న విపరీతమైన ఇష్టాన్ని చాటుకుంటున్నాడు.
ఈసినిమా గురించి విషయాలను తెలియచేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ దేవ్ తన మామ చిరంజీవి తనకు ఇచ్చిన హెచ్చరికలను బయట పెట్టాడు. సినిమా అంటే సరదాగా చూసినంత ఈజీ కాదని ఈ రంగంలో బాగా కష్టపడిన వాడికి మాత్రమే ఆదరణ దక్కుతుందని చెప్పిన సలహాను గుర్తుకు చేసుకున్నాడు.
అంతేకాదు తన బ్యాక్ గ్రౌండ్ ఒక సినిమా ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుంది కాని తన బ్యాక్ గ్రౌండ్ తో ప్రేక్షకుల అభిమానం పొందడం అంత సులువైన పనికాదు అని తనకు మొదట్లోనే చిరంజీవి హెచ్చరికలతో కూడిన సలహాలు ఇచ్చాడు అని కళ్యాణ్ దేవ్ చెపుతున్నాడు. ఇక ‘సూపర్ మచ్చి’ సినిమాలో తనది మాస్ పాత్ర అని చెపుతూ ఈ మూవీలో తాను బార్ సింగర్ గా పాటలు పాడుతూ కనిపిస్తాను అంటూ లీకులు ఇస్తున్నాడు.
ఇక సినిమా కథల విషయంలో అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటానని కేవలం ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే ముందు మాత్రమే తను చిరంజీవికి తెలియచేస్తాను అని అంటున్నాడు. ఇదే సందర్భంలో తన లేటెస్ట్ మూవీ ‘సూపర్ మచ్చి’ కి మొదట్లో ఏర్పడిన హీరోయిన్ కష్టాల గురించి వివరిస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. మొదట్లో ఈ సినిమాకు రియా చక్రవర్తిని హీరోయిన్గా తీసుకున్నామని రెండు వారాల పాటు షూటింగ్ చేశాక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సినిమా ఉందంటూ మధ్యలోనే ఆమె వెళ్ళిపోవడంతో తాను షాక్ అయిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రచితా రామ్ ను తీసుకుని తిరిగి రీషూట్ చేసిన పరిస్థితులను వివరిస్తూ అప్పుడు తనకు తన మామ చిరంజీవి ఇచ్చిన సలహాలలో ఉన్న నిజం తనకు పూర్తిగా అర్ధం అయింది అని అంటున్నాడు..