శర్వానంద్ హీరోగా 2014 లో వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన భామ సీరత్ కపూర్, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన రన్ రాజా సినిమాలో అడవిశేష్ కూడా ప్రధాన పాత్ర పోషించాడు. అయితే హీరోయిన్ సీరత్ కపూర్, రన్ రాజా రన్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా టైగర్ సినిమాలో మెరిసింది. కానీ ఆ సినిమా అనుకున్నంతగా విజయం అందుకోలేదు.
ఆ తర్వాత కొలంబస్, రాజుగారి గది2, ఒక్కక్షణం ,టచ్ చేసి చూడు సినిమాలు చేసినప్పటికీ ఏవీ హీరోయిన్ గా ఆమెకి గుర్తింపుని తీసుకురాలేదు. అయితే తాజాగా ఆమె నటించిన క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో సీరత్ కపూర్ రుక్సాన్ అనే పాత్రలో హీరోకి ఫ్రెండ్ గా కనిపించింది.
ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో సీరత్ కపూర్ చాలా హ్యాపీగా ఉంది. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో సినిమా విషయాలతో తన వ్యక్తిగత విషయాలని కూడా పంచుకుంది. ఆమె చదువుకునే సమయంలో కొంతమంది ఆమెకి ప్రపోజ్ చేసారట. ఆ ప్రపోజల్స్ ని చూసి బాగా నవ్వుకునేదట. ఆమె ఎవ్వరికీ ఓకే చెప్పకపోయినప్పటికీ అంత ధైర్యంగా ప్రపోజ్ చేయడంతో వారిపై గౌరవం పెరిగిందట. క్రిష్ణ అండ్ హిస్ లీల ద్వారా మంచి హిట్ అందుకున్న సీరత్ కపూర్, మరిన్ని అవకాశాలు తెచ్చుకుంటుందేమో చూడాలి.