సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ చాలా రోజులు గ్యాప్ తీసుకుని సర్కారు వారి పాట సినిమాని ప్రకటించాడు. క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని మే30వ తేదీన ఈ సినిమా ప్రకటన బయటకి వచ్చింది. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సర్కారు వారి పాట స్టైలిష్ గా ఉండడంతో పాటు మాస్ ఆడియన్స్ కి కావాల్సినట్టుగా ఉంటుందట.

IHG

 

మాస్ జనాలకి కావాల్సిన పవర్ ఫుల్ డైలాగులతో పాటు, హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉండనున్నాయట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గఅ కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. నిజానికి హీరోయిన్ గా బాలీవుడ్ తారలైన కియారా అద్వానీ, సాయి మంజ్రేకర్ పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం కీర్తికే ఓటు వేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీర్తి పాత్రపై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BOLLYWOOD' target='_blank' title='bollywood-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bollywood</a> debut is wrapped

సర్కారు వారి పాట బ్యాంకుల మోసాల నేపథ్యంలో ఉండనుందని వార్తలు వచ్చాయి. అందుకోసం ఈ సినిమా కోసం బ్యాంకు సెట్ ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అయితే కీర్తి సురేష్ బ్యాంకు ఎంప్లాయిగా కనిపించనుందట. బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తూ ఇంటిలిజెంట్ అయిన హీరో మహేష్ ప్రేమలో పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమన్నది చిత్రబృందానికే తెలియాలి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: