టాలీవుడ్ లో ఒక్క సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిపోయాడు అనీల్ రావిపూడి. మహేష్ బాబుతో అతను చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా అతనికి మంచి ఇమేజ్ ని తెచ్చింది అనే చెప్పాలి. ఆ సినిమాలో అతను మహేష్ ని చూపించిన విధానం టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది అనే మాట వాస్తవం. ఆ సినిమాలో అతను మహేష్ ఒక రేంజ్ లో చూపించాడు అని సినిమా చూసిన మహేష్ బాబు ఫాన్స్ సోషల్ మీడియాలో చాలానే కామెంట్ చేస్తూ వచ్చారు. ఇక మహేష్ బాబు కి అనీల్ పనితనం బాగా నచ్చింది అని అంటున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు తో మరో సినిమా చేయడానికి అనీల్ ఒక మంచి కథను రెడీ చేసాడు అని సమాచారం. మరి అది నిజం ఎంత అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి గాని ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే మహేష్ బాబు కి అతను చెప్పిన కథ చాలా బాగా నచ్చింది అని సినిమాకు మహేష్ ఓకే చెప్పాడు అని అంటున్నారు. ఇప్పుడు ఒక సినిమాను అనీల్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆ సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. మరి ఎప్పుడు ఆ సినిమా వస్తుందో చూడాలి. 

 

మహేష్ బాబు ఇప్పుడు సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆగింది. ఎప్పుడు మొదలు పెట్టే అవకాశం ఉంది అనే దాని మీద త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన చేసే సూచనలు ఉన్నాయి. హీరోయిన్ ని కూడా మార్చే అవకాశం ఉంది అనే  దాని మీద కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: