హృతిక్ రోషన్ హీరోగా పరిచయం అయిన కహోనా ప్యార్ హై సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నటి అమిషా పటేల్. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ. అయితే స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ తరువాత అదే ఫాం కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో హాట్ షోకే పరిమితమైంది అమిషా.
ఒకప్పుడు టాప్ స్టార్గా ఓ వెలుగు వెలిగిన అమిషా అవకాశాలు తగ్గటంతో చిన్న చిన్న సినిమాలకు కూడా ఓకె చెప్పింది. అంతేకాదు గ్లామర్ షోకు గేట్లు ఎత్తేయటంతో బాగానే బిజీ అయ్యింది. కానీ స్టార్ హీరోలు మాత్రం ఆదరించలేదు. ప్రస్తుతం ప్రవేట్ ఈవెంట్స్తో పాటు పలు కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపేస్తున్ నఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ తన అందాన్ని తానే ఆస్వాదిస్తూ ఓ ఫోటో షార్ట్ వీడియోను షేర్ చేసింది. క్లీవేజ్ కనిపించేలా మల్టీ కలర్ టాప్ వేసుకున్న షార్ట్ వీడియోను షేర్ చేసిన బ్యూటీ నేను హాట్గా ఉండాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.