మహేష్ బాబు సినిమా అనగానే చాలా మందికి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. బాబు సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒక రేంజ్ లో పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాలో ఉండే కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఫాన్స్ కి ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంటుంది. అతను ఏ సినిమా చేసినా సరే దాదాపుగా ఇదే వాతావరణం ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు అతను ఒక సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు పరుశురాం. 

 

ఇక ఈ సినిమా విషయంలో మహేష్ బాబు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మరి  కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఈ సినిమా విషయంలో అతను కాస్త భయపడుతున్నాడు అని అంటున్నారు. ఈ సినిమాను రెండేళ్ళ పాటు వాయిదా వేస్తే మంచిది అనే ఆలోచన కూడా ఉంది అని టాక్. దీనికి సంబంధించి దర్శక నిర్మాతలకు అతను ఇప్పటికే చెప్పాడు అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఈ సినిమాను మాత్రం దాదాపు రెండేళ్ళ పాటు వాయిదా వేయడం ఖాయమని అంటున్నారు. 

 

సినిమా కథ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఆలస్యంగా చేయడమే మంచిది అని ఇప్పుడు ఫాస్ట్ గా సినిమాను చేస్తే అనవసరంగా పెట్టుబడి వచ్చే అవకాశం కూడా ఉండదు అని మహేష్ భావిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా అతను చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే విడుదల చేసాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి అనీల్ రావిపొడి దర్శకత్వంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: