పాన్ ఇండియన్ సినిమాలు అంటే ఎక్కువగా టాప్ హీరోలే కనిపిస్తారు. మేకర్స్ కూడా స్టార్స్ తోనే మల్టీలింగ్వల్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు చిన్న హీరోలు కూడా పాన్ ఇండియన్ మూవీస్ లో నటిస్తున్నారు. నార్త్ ఆడియన్స్ కు తెలుగు టాలెంట్ చూపించాలని బారీ స్కెచ్చులేస్తున్నారు. 

 

నాని ఎప్పుడూ సేఫ్ జోన్ కే ప్రియారిటీ ఇస్తాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఓ పీరియాడికల్ డ్రామాతో పక్క రాష్ట్రాల్లోనూ పాగా వేయాలనుకుంటున్నాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటించబోయే స్యామ్ సింగరాయ్ మల్టీలింగ్వల్ గా రాబోతోంది. 

 

విజయ్ దేవరకొండ సినిమా సెలక్షన్ లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాడో, మార్కెట్ విషయంలో అంత కేరింగ్ గా ఉంటాడు. సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలతో సౌత్ మార్కెట్ లో హంగామా చేసిన రౌడీ ఇపుడు నార్త్ కు వెళ్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మార్షల్ ఆర్ట్స్ మూవీతో హిందీ పరిశ్రమకు వెళ్తున్నాడు. 

 

నితిన్ కూడా పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నాడు. చైతన్య కృష్ణ దర్శకత్వంలో ఒక మల్టీలింగ్వల్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. వీళ్ల కాంబోలో రాబోతున్న పవర్ పేట సినిమా లార్జ్ స్కేల్ లో భారీగా తెరకెక్కుతోందని సమాచారం. మొత్తానికి యంగ్ హీరోలు పాన్ ఇండియా మూవీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్లూ టాలీవుడ్ లో తమ సత్తా చాటిన వాళ్లు ఇపుడు ప్రమోషన్ కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తమ అభిమానులుగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

 

మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఇక దేశంలో దున్నేయనున్నాడు. నేచురల్ స్టార్ నాని సైతం నటనలో జీవిస్తే ఎలా ఉంటుందో చూపించనున్నాడు. ఇక నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచిన నితిన్ పాన్ ఇండియా మూవీస్ దిశగా అడుగులు వేయడం చూస్తే ఎంతో ఆసక్తి కలుగక మానదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: