ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ ఇప్పటికే రెండు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు. అందులో ఒకటి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా కాగా మరోటి కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా. ఈ రెండు సినిమాల్లో ఏది మొదట స్టార్త్ అవుతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే పరిస్థితులు చూస్తుంటే ప్రశాంత్ నీల్ తోనే తారక్ సినిమా మొదలుపెడతాడని తెలుస్తుంది. ఈ సినిమా లైన్ నచ్చి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట తారక్. ఇక ఇదిలాఉంటే ట్రిపుల్ ఆర్ తర్వాత రాం చరణ్ మెగాస్టార్ హీరోగా వస్తున్న ఆచార్య సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నడని తెలిసిందే.

 

ఇక ఈ సినిమా తర్వాత చరణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. పవన్, చరణ్ కలిసే కాని పవన్ నిర్మాణంలో చరణ్ హీరోగా ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాకు డైరక్టర్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ పేరు వినపడుతుంది. అదేంటి ఆల్రెడీ త్రివిక్రం తారక్ తో సినిమా ఒప్పేసుకున్నాడుగా అనుకోవచ్చు. ఆ సినిమాకు ముందే ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయట. ఎలాగు ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ముందు చేస్తాడని తెలిసే త్రివిక్రం ఈ కాంబో సెట్ చేసుకున్నాడని అంటున్నారు.

 

బాబాయ్ నిర్మాతగా.. అబ్బాయి హీరోగా.. స్నేహితుడు డైరెక్ట్ చేసే ఈ సినిమా తప్పకుండా భారీ అంచనాలతో వస్తుందని చెప్పొచ్చు. అల వైకుంఠపురములో సక్సెస్ తో ఫుల్ ఫాం లో ఉన్న త్రివిక్రం మెగా వారసుడితో చేసే సినిమా మెగా ఫ్యాన్స్ అందరు కొంతకాలం గుర్తుంచుకునేలా చేస్తాడని ఫిక్స్ అవుతున్నారు.                         

మరింత సమాచారం తెలుసుకోండి: