కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప అన్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా 5 ప్రధాన భాషల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే.  మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు.. భీష్మ సినిమాలతో హిట్స్ అందుకుని మరే హీరోయిన్ కు దక్కని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

 

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేస్ లో రష్మిక మందన్న ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరస్ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన రష్మిక సోషల్ మీడియా ద్వారా  అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా మరోసారి అభిమానులతో చాట్ చేసింది.  ఈ  సందర్బంగా రష్మిక తను సినిమాలను  ఎంపిక చేసుకునే విషయంలో  ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది .  నేను సినిమాలు కమిట్ అయ్యేందుకు ప్రధానంగా రెండు విషయాలను పరిగణలోకి తీసుకుంటాను. నా పాత్రలో ఎమోషన్ డెప్త్ గా ఉండాలి అలాగే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్మెంట్ అందించే విధంగా నా పాత్ర ఉండాలంటూ చెప్పుకొచ్చింది. 

 

కథలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించాలనుకుంటాను అంటూ తెలిపింది. ఇలా తన మొదటి సినిమా కిరాక్ పార్టీ నుండి ఇదే ఫాలో అవుతున్నట్లుగా పేర్కొంది. అంతే ఒక వేళ తన పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా ఒప్పుకోదట. ఇక రష్మిక రెండు తమిళ సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి కార్తీ సినిమా కాగా మరొకటి తలపతి విజయ్ సినిమా కావడం విశేషం. ఇక ఈ కన్నడ బ్యూటి అవకాశం వస్తే సమంత, కాజల్ అగర్వాల్ మాదిరిగా వెబ్ సిరీస్ లోను నటించాలనుకుంటుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: