టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ కొట్టడం జరిగింది. పవన్ సరసన అమీషా పటేల్, రేణు దేశాయి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని విజయలక్ష్మి ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ పై టి త్రివిక్రమ రావు నిర్మించారు. ఇక ఆ తరువాత నుండి వరుసగా దర్శకత్వ అవకాశాలతో ముందుకు సాగిన పూరి, అనతికాలంలోనే దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. 

IHG

ఒకానొక సమయంలో రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్నతమిళ అమ్మాయి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న పూరి, సరిగ్గా 2006లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన పోకిరి సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. ఆపై పూరికి మరింతగా వరుస అవకాశాలు వచ్చాయి. కాగా వాటిని సక్సెస్ లు గా మలుచుకుంటూ ముందుకు సాగిన పూరికి, కొన్నాళ్ల క్రితం నుండి మాత్రం ఆశించిన రేంజ్ సక్సెస్ మాత్రం రావడం లేదు. అయితే గత ఏడాది హీరో రామ్ తో పూరి తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎట్టకేలకు సూపర్ హిట్ కొట్టి పూరి జగన్నాథ్ కు దర్శకుడిగా మంచి బ్రేక్ ని ఇచ్చింది. ప్రస్తుతం యువ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ పేరుతో పాన్ ఇండియా రేంజ్ మూవీ తీస్తున్న పూరి, దాని అనంతరం తన డ్రీమ్ ప్రాజక్ట్ జనగణమణ ని తీయనున్నట్లు తెలుస్తోంది. 

 

ఇటీవల ఈ సినిమా గురించి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టిన పూరి, తప్పకుండా ఈ సినిమా తీస్తానని, టాలీవుడ్ లో ఈ సినిమా ఎప్పటికీ గుర్తిండిపోయే ప్రాజక్ట్ అవుతుందని పూరి చెప్పడం జరిగింది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబు నటిస్తారని కొన్నేళ్లుగా వార్తలు రావడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ సినిమా విషయమై పూరి పోస్ట్ పెట్టిన తరువాత నుండి ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణ నటిస్తున్నారనే మరొక వార్త విస్తృతంగా ప్రచారం అవుతూ వస్తోంది. ఇక మరికొందరు అయితే వారిద్దరూ కాదు మరొక స్టార్ హీరో ఒకరు నటిస్తున్నట్లు ప్రచారం చేసారు. కాగా ఈ పుకార్లతో విసిగిపోయిన పూరి, తన జనగణమణ సినిమాని ఎప్పుడు తీయాలో, ఎవరితో తీయాలో తనకు తెలుసునని, ఈ విషయమై తనకు ఎవరి సలహాలు అవసరం లేదని, ఆ ప్రచారాలపై కొంత పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరి పూరి చేయబోయే ఈ డ్రీమ్ ప్రాజక్ట్ లో హీరోగా ఎవరు నటిస్తారో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: