టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకున్న నటుడు లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ. ముందుగా తేనెమనసులు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన కృష్ణ, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆపై మెల్లగా తన టాలెంట్ తో వరుసగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన కృష్ణ, అనతికాలంలోనే ఎన్నో వరుస విజయాలతో దూసుకెళ్లారు. అప్పట్లో అతి పెద్ద మాస్ హీరోగా ఎంతో గొప్ప క్రేజ్ తో పాటు పేరు ప్రఖ్యాతలు, అభిమానులను సంపాదించిన కృష్ణ, తన కెరీర్ లో మొత్తం 350 పైచిలుకు సినిమాల్లో నటించారు. సాక్షి సినిమా తరువాత విజయనిర్మలను రెండవ వివాహం చేసుకున్న కృష్ణ, ఆ తరువాత నుండి ఆమె దర్శకత్వంలో అనేక సినిమాలు చేసారు. 

 

మొదటి నుండి కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ కూడా ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుండడం గమనించవచ్చు. ఆ విధంగా వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఎన్నో ఏళ్లు ప్రేమానురాగాలతో కొనసాగిన వారి దాంపత్యంలో ఇటీవల విజయనిర్మల హఠాన్మరణంతో కృష్ణ మానసికంగా ఎంతో కృంగిపోయారు. మరోవైపు కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తుండడంతో కృష్ణ పూర్తిగా తన ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఇటీవల టాలీవుడ్ ప్రఖ్యాత కథారచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఇప్పుడిప్పుడే కృష్ణ గారు మెల్లగా విజయనిర్మల గారి జ్ఞాపకాల నుండి తేరుకుంటున్నారని, ఎంతైనా భార్య పోవడంతో భర్తగా బాధ అనేది ఉంటుందని, కానీ జీవితగమనం ముందుకు సాగాలంటే మనసుని నిబ్బరం చేసుకోవాలని ఆయన అన్నారు. 

 

ఇక ప్రస్తుతం కృష్ణ గారి కాలక్షేపానికి పలు కథల, రచనల పుస్తకాలు అందించాం అని, ఆయన వాటిని ఎప్పటికప్పుడు చదువుతూ ప్రశాంతంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారని పరుచూరి చెప్పడం జరిగింది. ఇకపోతే నిన్న కృష్ణ కుమార్తె మంజుల, తన తండ్రి మాస్క్ పెట్టుకుని కార్లో బయటకు వచ్చిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఆ ఫోటోని బట్టి చూస్తే కృష్ణ గతంతో పోలిస్తే కొంత బెటర్ గానే ఉన్నట్లు కనపడుతోంది. అందరూ ఎవరికి వారు తప్పనిసరిగా సామజిక దూరం పాటించడంతో పాటు, మాస్క్ ధరించి ఈ కరోనా మహమ్మారి నుండి రక్షించుకోవాలని మంజుల తన పోస్ట్ ద్వారా కోరడం జరిగింది. కాగా మంజుల పోస్ట్ చేసిన కృష్ణ ఫోటో ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: