టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో మంచి ప్రేమకథగా పలు కమర్షియల్ హంగుల మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాకు ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అతి త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తుండగా, ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తోంది. 

IHG' dapper suit-looks which will surely give his fans major ...

ఇకపోతే బాహుబలి రెండు భాగాల సూపర్ డూపర్ హిట్స్ తరువాత కేవలం మన దేశవ్యాప్తంగానే కాక పలు విదేశాల్లో కూడా తన క్రేజ్ ని అమాంతం పెంచేసుకున్నాడు ప్రభాస్. ఆ తరువాత ఆయన నటించిన సాహో సినిమా అయితే ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. యావరేజ్ విజయాన్ని అందుకున్న ఆ సినిమా నార్త్ లో అయితే బాగానే కలెక్షన్స్ ని రాబట్టడం జరిగింది. ఇప్పటికే ప్రభాస్ రేంజ్ విపరీతంగా పెరగడంతో బాలీవుడ్ లోని బడా స్టార్స్ కు కొంత ముచ్చెమటలు పడుతున్నట్లు తెలుస్తోంది. సాహో కు ఒకింత నెగటివ్ టాక్ ని అక్కడి మీడియా తేవాలని ప్రయత్నించినప్పటికీ, ప్రభాస్ ఛరిష్మా ముందు వారి ఎత్తులు పారలేదని తేలిపోయింది. 

 

ప్రస్తుతం రాధాకృష్ణతో చేస్తున్న సినిమా తో పాటు ఇకపై ప్రభాస్ నుండి ఇకపై రానున్న సినిమాలు అన్ని కూడా దాదాపుగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయేవే కనుక, వాటిలో మరొక మూడు సినిమాలు కనుక మంచి హిట్స్ కొడితే, బాలీవుడ్ బడా హీరోలను వెనక్కునెట్టి మన డార్లింగ్ అక్కడ జెండా పాతి కింగ్ రేంజ్ లో నిలవడం ఖాయం అని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు. ఇప్పటికే ప్రభాస్ క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ స్థాయి తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడాఎంతో విపరీతంగా పెరిగిపోయిందని, అందువలన మరొక మూడు సరైన హిట్స్ ప్రభాస్ కు పడితే ఆయనను ఆపడం అక్కడి హీరోలకు చాలావరకు కష్టం అని అంటున్నారు. మరి మన డార్లింగ్ నుండి రాబోయే సినిమాలు ఎంత మేర సక్సెస్ అందుకుంటాయో, ఆయన ఏ రేంజ్ క్రేజ్ సంపాదిస్తారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: