కరోనా విధ్వంసాన్ని ముందే కనిపెట్టిన ప్రభుత్వం దేశం మొత్తాం 41 రోజులు లాక్ డౌన్ ప్రకటించింది. కొన్ని ఆంక్షలతో కూడిన ఈ లాక్ డౌన్ వల్ల చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు కాని అన్ లాక్ చేసిన తర్వాత కేసులు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఇదిలాఉంటే లాక్ డౌన్ టైంలో సెలబ్రిటీస్ అంతా తమ ఇల్లకే పర్మితమై తమ సొంత టాలెంట్ చూపించేస్తున్నారు.

 

అందులో భాగంగా హీరోయిన్స్ అంతా కూడా స్వయం పాకంతో సర్ ప్రైజ్ చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్దే లాక్ డౌన్ టిమె లో కొత్త వంటకాలు చేస్తూ అలరించింది. ఇక మరో పక్క ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా కేకులు గట్రా చేస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఇక కాజల్ కూడా సమోసా తయారు చేసి అందరిని సర్ ప్రైజ్ చేసింది. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు కనీసం వంట గది వైపుకి కూడా వెళ్లని స్టార్స్ అంతా ఈ లాక్ డౌన్ టైం లో నలభీమ పాకాలను ప్రయత్నించారు.

 

ముఖ్యంగా ఈ టైం లో కొందరు హీరోయిన్స్ తమ వంటని పర్ఫెక్ట్ చేసుకుంటే.. అసలు వంట రాని వారు నేర్చేసుకున్నారు. మొత్తానికి ఇంత లాంగ్ గ్యాప్ ఎవరికి వచ్చి ఉండదు. దాన్ని కూడా వేస్ట్ చేయకుండా కొందరు భామలు ఫిట్ నెస్ మీద.. కొందరు కొత్త వంటకాలు నేర్చుకోవడంతో టైం పాస్ చేశారు. ఇక కొందరు భామలు మాత్రం యోగాలు చేస్తూ అలరించారు. అదా శర్మ మాత్రం రకరకాల యోగా ఆసనాలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. సమంత మాత్రం చైతన్యతో పాటుగా తన పెంపుడు కుక్కతో కూడా ఆడుకుంటూ ఇంట్లోనే ఉంది.                      

మరింత సమాచారం తెలుసుకోండి: