టాలీవుడ్ లో రాజమౌళి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా అనగానే ఫాన్స్ కి ఒక రేంజ్ లో పండగ. ఫాన్స్ కి మాత్రమే కాదు సినిమాలు చూసే ఎవరు అయినా సరే ఆయన సినిమా చేస్తే కచ్చితంగా చూడాల్సిందే. ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమాను మెగా నందమూరి హీరోలతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి టాలీవుడ్ లో జనాలు చాలా వరకు ఆశగా  ఎదురు చూస్తున్నారు.  బాహుబలి సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇదే కావడం దానికి తోడు మెగా హీరో నందమూరి హీరో తో సినిమా కావడం తో ఇండియన్ సినిమా ఐతే  బాగా ఎదురు చూస్తుంది. 

 

ఇక ఈ సినిమా గురించి లాక్ డౌన్ లో చాలానే వార్తలు వచ్చాయి లాక్ డౌన్ లోనే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేసారు. అదే విధంగా లుక్స్ ని కూడా చూపించారు ఫాన్స్ కి అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయంలో కూడా చాలానే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత  జక్కన్న మహేష్ తో చేస్తున్నట్టు ఒక ప్రకటన చేసారు. టాలీవుడ్ లో ఈ ప్రకటన  షేక్ చేసింది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత ఈ సినిమా చేసే అవకాశం ఉంది అని అన్నారు. ఇక ఈ సినిమాను స్వయంగా జక్కన్న ప్రకటన చేయడం తో చాలా మంది ఒక్కసారిగా అవునా అంటూ ఎదురు చూసారు. 

 

ఇక ఈ లాక్ డౌన్ లో ఫాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చిన ప్రకటన అదే అనే మాట వాస్తవం. మరి ఈ సినిమా అసలు వస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: