పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. దాంతో ఒక్కసారిగా అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ ఎవరూ ఊహించని సీన్లని ఎంతో బోల్డ్ గా చూపించిన ఈ సినిమా భారీ విజయం అందుకుంది.

 

సినిమా తర్వాతే ఆంగర్ మేనేజ్ మెంట్ అన్న కాన్సెప్ట్ బాగా పాపులర్ అయింది. అయితే ఇంతటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలుగు చిత్ర పరిశ్రమలో గేమ్ ఛేంజర్ గా నిలిచాడు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోనూ ఫేమస్ అయ్యాడు. బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం విజయ్ గురించి మాట్లాడుకున్నారంటే అర్జున్ రెడ్డి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

 

అయితే అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసారు. ఈ రీమేక్ చిత్రానికి కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతేకాదు షాహిద్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే సందీప్ వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మళ్లీ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ మేరకు విజయ్ కూడా సందీప్ దర్శకత్వంలో నటించాలని ఉందని చెప్పాడు.

 

అయితే ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ టైమ్ లో సందీప్, విజయ్ తో సినిమా కోసం కథని సిద్ధం చేసాడట. తన దగ్గరున్న రెండు కథల్లో ఒక కథతో బాలీవుడ్ సినిమా చేయనున్నాడట. మరో కథని ప్రత్యేకంగా విజయ్ కోసమే రాసాడట. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి రెండేళ్ల సమయం పడుతుందట. అంటే మరో సంచలనానికి రెండేళ్ళు వెయిట్ చేయాలన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: