కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది .. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు .
కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు తమను తాము ఎలా కాపాడు కోవాలో అన్న విషయాలను సినీ తారలు తెలియ పరుస్తున్నారు.. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా జాగ్రత్తలు తెలుపుతున్నారు.. ఈ మేరకు చాలా మంది పాటలతో కవితలతో తెలియ జేస్తున్నారు.. ప్రజలను ఇళ్లలో ఉండాలని సూచించారు.. తాజాగా తెలుగు సంచలన రియాల్టీ షో ‘బిగ్బాస్’ కంటెస్ట్లు కలిసి ఓ వీడియోను రూపొందించారు.. ‘బోర్ కొడుతోంది’ అంటూ తెలుగు ర్యాపర్ రోల్ రైడా స్వరపరిచిన పాట నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి అందరికి తెలిసిందే .
ఆ పాటకు యువ కథానాయకుడు తనిష్ దర్శకత్వం వహించారు. ఈ వీడియోలో ‘బిగ్బాస్’ కంటెస్టెంట్లు గీతా మాధురి, నందిని రాయ్, భాను శ్రీ, శ్యామల, దీప్తి నల్లమోతు, దీప్తి సునయన, పూజా రామ చంద్రన్, సంజన, తనీష్, అమిత్ సామ్రాట్, గణేశ్, కిరిటీలు పాట పాడుతూ అలరించారు. ఆ వీడియో అప్పుడు విపరీతంగా ట్రెండ్ అయింది. కేవలం వినోదాన్ని ఇవ్వడమే కాదు.. ఒక చక్కటి మెసేజ్ ను కూడా ఇవ్వడంతో అందరూ ఫిదా అయ్యారు..