టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ మొదట్లో కొంత రిజర్వుడుగా ఉండే వారు. అయితే రాను రాను మెల్లగా కాలం గడుస్తున్న కొద్దీ కొంత ఫ్రీగా అందరితో మాట్లాడడం అలవాటుచేసుకున్న సూపర్ స్టార్, సెట్స్ లో అందరినీ ఎంతో సరదాగా పలకరిస్తూ సెట్ మొత్తం సందడి చేస్తుంటారని పలువురు చెప్తూ ఉంటారు. ఇకపోతే తన షూటింగ్ పూర్తి అవ్వగానే వెంటనే ఇంటికి వెళ్ళిపోయి హాయిగా ఫ్యామిలీతో గడిపే అలవాటున్న సూపర్ స్టార్, ఎక్కువగా తనకు తీరిక దొరికిన సమయాల్లో ఫ్యామిలితో కలిసి విదేశాలకు ట్రిప్స్ వేయడం, అలానే వారితో కలిసి సరదాగా పలు వెకేషన్స్ కు వెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. 

IHG'who is taller' amid lockdown ...

నమ్రత తో వివాహం తరువాత, అలానే ఆపై కొడుకు గౌతమ్, కూతురు సితార పుట్టిన తరువాత మరింతగా ఫ్యామిలీకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్న సూపర్ స్టార్, ప్రతి మనిషికి లైఫ్ లో ఫ్యామిలీకి మించి ఏది ముఖ్యం కాదని, డైలీ మన పని చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరి, కుటుంబసభ్యులతో కలిసి సరదాగా కబుర్లు చెపుతూ భోజనం చేసి రోజుని పూర్తి చేయడం తనకు ఇష్టం అని, తాను అదే పాటిస్తానని చెప్తూ ఉంటారు మహేష్. ఇక ఇటీవల కొన్ని నెలలుగా ప్రపంచం మొత్తం కూడా కరోనా మహమ్మారి కోరలు విసరడంతో పలు దేశాలతో పాటు మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎక్కువగా తమ పిల్లలతో మరింత సరదాగా గడుపుతూ, ఎప్పటికప్పుడు వారితో సరదా సరదా గేమ్స్ ఆడుతూ పలు రకాల ఫోటోలను మహేష్ బాబు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో కొన్నాళ్లుగా పోస్ట్ చేస్తున్నారు. 

 

ఈ లాక్ డౌన్ సమయం తనకు, మహేష్ కు పిల్లలకు మరింతగా చేరువయ్యేందుకు అవకాశం కల్పించిందని మహేష్ సతీమణి నమ్రత అన్నారు. ఆ విధంగా ఈ లాక్ డౌన్ సమయాన్ని హ్యాపీగా భార్య, బిడ్డలతో గడుపుతున్న సూపర్ స్టార్, అతి త్వరలో పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటించనున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: