టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా మంది హీరోల మాదిరిగా రెగ్యులర్ గా తన షూటింగ్ కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం, ఇంటికి చేరుకొని వారితో కలిసి సరదాగా గడపడానికి ఇష్టపడుతుంటారు. ఎక్కువగా తనకు అవుట్ డోర్ షూటింగ్స్ ఉన్నపుడు మాత్రం బిడ్డలను మిస్ అవుతూండేవాడిని అని, అయితే అటువంటి సమయంలో తన భార్య సురేఖ వారికి అన్నివిధాలుగా తోడు నీడగా ఉండి ధైర్యాన్ని అందించేదని ఆయన అంటూ ఉంటారు. 

IHG

తనకు అవకాశం దొరికినప్పుడల్లా పిల్లలతో ఎంతో సరదాగా ఎంజాయ్ చేయడం, ఒకవేళ మరికొన్ని రోజులు ఖాళి దొరికితే వారితో కలిసి హ్యాపీగా వెకేషన్స్ కు వెళ్లడం వంటివి మెగాస్టార్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల కొన్నాళ్లుగా మన దేశంలో కూడా కరోనా కారణంగా లాక్ డౌన్ విధించబడడంతో ఎక్కువగా తనయుడు రామ్ చరణ్, తల్లి అంజనమ్మతో కలిసి ఎంతో సరదాగా కలిసి మెలిసి గడుపుతున్న మెగాస్టార్, ఆమె కోసం ఒకానొక సమయంలో చేతిలో గరిటె పట్టి పెసర దోసెలు కూడా వేశారు. 

 

చిన్నప్పటి నుండి అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేదని, నాన్న వేరే ఊళ్లకు క్యాంపు మీద వెళ్ళినపుడు అమ్మ మాకు నాన్న లేని లోటు తెలియకుండా చూసుకునేదాని, అలానే జీవితంలో ఎలా పైకి ఎదగాలి, బ్రతకడం అంటే మనతోటి వారిని కూడా బ్రతికిస్తూ ముందుకు సాగడం వంటి గొప్ప గొప్ప జీవిత సత్యాలు మాకు ఆమె నేర్పెదని, ఈ విధంగా లాక్ డౌన్ సమయంలో తనయుడు చరణ్ తో పాటు, తల్లి అంజనమ్మతో కలిసి గడపడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల మెగాస్టార్ మాట్లాడుతూ చెప్పారు. నేను ఎంత ఎదిగినా ఆమెకు పిల్లాడినే, అలానే చరణ్ కూడా అంతే. ఒక్కోసారి మా ఇద్దరిలో ఏరంటే  ఎక్కువ ఇష్టం అంటూ నేను, చరణ్ ఇద్దరం అమ్మ అంజనమ్మతో సరదాగా గొడవపడుతుంటాం అంటూ మెగాస్టార్ ఇటీవల తెల్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: