కరోనా వైరస్.. గత ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక మమమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను తన గుప్పెట్లో పెట్టుకుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు వేల మంది ప్రానాలను హరించివేస్తుంది. ఇక వ్యాక్సిన్ లేని ఈ కరోనాను కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఇంటికే పరిమితం అయ్యాయి. సినిమా షూటింగ్స్ కూడా అగిపోయాయి. అయితే ఈ లాక్డౌన్ టైమ్లో కేవలం టైటిల్తోనే సెస్పేషన్ క్రియేట్ చేశాడు మహేష్ బాబు.
సరిలేరు నీకెవ్వరూ వంటి సూపర్ హిట్ అందుకున్న మహేష్.. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ను ఫిక్స్ చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం `సర్కారు వారి పాట`. తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ పాటు ప్రీ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేసి.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే ఈ చిత్రంలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు అన్నదే ఈ సినిమా కథగా ప్రచారం జరుగుతోంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లతో కలిసి మహేష్ బాబు స్యయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుందని తెలుస్తోంది.