గత మూడు నెలల క్రితం నుంచి కరోనా వైరస్ ప్రబలిపోతుందన్న కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో కరెంట్ బిల్ ఆన్ లైన్లో చెల్లించాలని అన్నారు.  మరోవైపు కరెంట్ బిల్లు వరుసగా రెండు మూడు నెలలు కలిపి వచ్చిన వారు ఉన్నారు. కొన్ని చోట్ల కరెంట్ బిల్లులు చూసి గుండె గుభేల్ అన్నవారు కూడా ఉన్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజల నెత్తిన విద్యుత్ బిల్లులు పిడుగులా పడుతోన్న విషయం తెలిసిందే.  కనీసం రూ.500 వందలు కూడా రాని వారికి వేలల్లో బిల్లులు వస్తున్నాయి.. మరీ విడ్డూరంగా కొన్ని చోట్ల లక్షల్లో కూడా వచ్చాయి. అయితే ఇది టెక్నికల్ పొరపాటు అంటూ విద్యుత్ అధికారులు సర్ధి చెబుతున్నారు.

 
 
 

తాజాగా బాలీవుడ్ నటుడు అర్ష‌ద్ వార్సి త‌న ఇంటికి భారీ మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందని వాపోయాడు. తన ఇంటికి 1,03,564  రూపాయాల క‌రెంట్ బిల్ వ‌చ్చింద‌ని అర్షద్ చెప్పాడు. సంజయ్ దత్ నటించిన మున్నాబాయి చిత్రంతో  అర్ష‌ద్ వార్సి బాగా పాపులర్ అయ్యారు. ఈ కరెంటు బిల్లు చూసి నా మతి పోయిందని.. తాను  వేసిన పెయింటింగ్స్ ను ఎవరైనా కొంటే వచ్చే డబ్బుతో ఈ విద్యుత్ బిల్ చెల్లిస్తాన‌ని ఆయన సరదాగా సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశాడు.

 

ఆ తర్వాత వచ్చే విద్యుత్‌ బిల్‌ను చెల్లించడానికి మాత్రం తన రెండు కిడ్నీల‌ని అమ్మేందుకు సిద్ధ‌మ‌వుతున్నానని అన్నాడు. ఆ మద్య  తాప్సీ, సందీప్ కిష‌న్‌ వంటి వారు తమకు వచ్చిన క‌రెంట్ బిల్లులపై షాక్ అవుతూ సోషల్ మాద్యమంలో చేశారు. సామాన్యులకు కూడా భారీ మొత్తంలో విద్యుత్‌ బిల్లులు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: