కియారా అద్వానీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. `ఫగ్లీ` చిత్రంతో ఇండిస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఎం.ఎస్.ధోని చిత్రంలో నటించి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఇక ఇటు తెలుగు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనూ హిట్ అందుకుంది.
బోయపాటి దర్శత్వంలో రామ్ చరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో కూడా కియారా నటించింది. ఆ తర్వాత మరో తెలుగు చిత్రం ఎంచుకోలేదు. కానీ, అటు బాలీవుడ్లో మాత్రం ఫుల్ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా.. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇక మరోవైపు సోషల్ మీడియా లోనూ హావా కొనసాగిస్తూ అభిమానులను వేడెక్కిస్తోంది. హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ.. అమాంతం తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా కూడా కియారా హాట్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.