ఇప్పుడు టాలీవుడ్ లో ఆచార్య సినిమా గురించి జనాలు ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. సినిమా కోసం జనాలు ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఎప్పుడు ఎప్పుడా అని మెగా ఫాన్స్ అయితే ఏ వార్త వచ్చినా సరే ఒక రేంజ్ లో  దాని గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. సినిమా కథ ఎలా ఉంటుంది చిరంజీవి ని ఏ విధంగా చూపించే అవకాశం ఉంటుంది అనే దాని మీద చాలా వరకు కూడా ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో చిరంజీవి మాత్రం బాగా లేట్ చేస్తున్నారు అని టాక్. 

 

ఆయన సినిమా మార్కెట్ ఆధారంగా విడుదల చెయ్యాలి అని రామ్ చరణ్ కి చెప్పారు అని సమాచారం. సినిమా మార్కెట్ అనేది ఇప్పట్లో ఉండే అవకాశం లేదు అని కాబట్టి లేట్ అయినా సరే కంగారు పడకుండా సినిమాను చెయ్యాలి అని ఆయన సూచనలు చేసారు అని సమాచారం. ఇక రామ్ చరణ్ కూడా ఏ మాత్రం ఈ సినిమా విషయంలో తొందరపడటం లేదు అని తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి తర్వాతనే విడుదల చేసే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు మరి. 

 

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి ఒక సినిమాను తమిళం లోవిజయ్ సేతుపతి తో కలిసి చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కథను చిరంజీవి విన్నారు అని కూడా సమాచారం. దీనికి సంబంధించి ఇప్పుయుడు చర్చలు నడుస్తున్నాయి అని త్వరలోనే దీనిని చాలా వరకు ముందుకు తెచ్చే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర హైలెట్ అవుతుంది అని టాలీవుడ్ లో అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: