కొందరి వాడు అనే ఇమేజ్ నుంచి బయటపడుతున్నాడు సురుతై శివ. ఒకే ఒక్క డైరెక్టర్ తోనే ఎక్కువ సినిమాలు చేస్తాడు... ఒక హీరో క్యాంప్ లోనే ఉండిపోయాడు అనే మాటలకు బ్రేకులేస్తున్నాడు శివ. హీరోలందరితో సినిమాలు చేస్తూ నేను ఎవరి క్యాంపులో లేను.. అందరివాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 

 

తెలుగులో శౌర్యం, శంఖం సినిమాలు చేసిన శివ, సిరుతైతో కోలీవుడ్ కు వెళ్లాడు. ఈ హిట్ తర్వాత వరుసగా అజిత్ తోనే నాలుగు సినిమాలు తీశాడు శివ. వీరమ్, వేదళం, వివేగం, విశ్వాసంతో అజిత్ కు హిట్ ఇచ్చాడు. ఇలా అజిత్ తోనే నాలుగు సినిమాలు తీయడంతో శివ, అజిత్ డైరెక్టర్ అనే పేరు పడింది. 

 

శివ ఇప్పుడీ ఇమేజ్ నుంచి బయటపడాలనుకుంటున్నాడు. అజిత్ క్యాంప్ అనే ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మిగతా హీరోలతోనూ సినిమాలు తీస్తున్నాడు. ఆల్ రెడీ అన్నాతై సినిమాతో రజినీకాంత్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ 2020 దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ మూవీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. 

 

శివ తర్వాత విక్రమ్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అన్నాతె పూర్తయ్యాక, వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని టాక్ వస్తోంది. ఇప్పటికే డిస్కషన్స్ పూర్తయ్యాయని త్వరలోనే అనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. అయితే ఈ కాంబినేషన్స్ చూస్తుంటే అజిత్ క్యాంప్ అనే మాటల నుంచి శివ బయటపడుతున్నాడనే చెప్పొచ్చు. మొత్తానికి శివ కొత్త దనాన్ని కోరుకుంటున్నాడు. మరి రజినీకాంత్ తో తీసే కొత్త మూవీ ఏమాత్రం సక్సెస్ నిస్తుందో చూడాలి. తర్వాత విక్రమ్ తో తీయబోయే సినిమా కూడా మంచి సక్సెస్ దక్కాలని కోరుకుందాం.. 




మరింత సమాచారం తెలుసుకోండి: