సూపర్ స్టార్ మహేష్ బాబు గడచిన రెండేళ్లలో చేసిన మూడు సినిమాలైన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లతో వరుసగా మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నారు. అంతకముందు సక్సెస్ కోసం కొంత సతమతమైన మహేష్ కు, వరుసగా వచ్చిన ఈ మూడు సక్సెస్ లు మంచి జోష్ ని అందించడం జరిగింది. ఇకపోతే వీటి అనంతరం అతి త్వరలో మహేష్ నటించనున్న సినిమా సర్కారు వారి పాట. 

IHG's Sarkaru Vaari ...

కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్న ఈ సినిమా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎంతో గ్రాండ్ నిర్మితం కానుంది. యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఒక కీలకమైన ఫిమేల్ పాత్ర ఉందని, కాగా ఆ పాత్రకు గాను నివేత థామస్ ని సినిమా యూనిట్ ఇటీవల ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో కొద్దిరోజుల నుండి ఒక వార్త ప్రచారం అవుతోంది. అయితే ఈ విషయమై అసలు జరిగింది ఇదే అని అంటున్నాయి కొన్ని ఫిలిం నగర్ వర్గాలు. 

 

ముందుగా సినిమాలో కీలకమైన ఆ ఫిమేల్ క్యారెక్టర్ కు గోవా భామ ఇలియానాని తీసుకుందాం అని దర్శకుడు పరశురామ్ భావించారని, అయితే కొన్ని అనుకోని కారణాల వలన ఆమె స్థానంలో నివేత అయితే బాగుంటుందని, ఇటీవల కలిసి కథ, తన పాత్ర వివరించగా, అవి ఎంతో నచ్చిన నివేత వెంటనే ఒప్పుకుందని అంటున్నారు. ఆ విధంగా ఆ అవకాశం నివేతను వరించిందట. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు తెలియాలంటే మాత్రం సర్కారు వారి పాట టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: