పుష్ప సినిమాను భారీ ప్రాజెక్ట్ గా మార్చేస్తున్నాడు సుకుమార్. మల్టీలింగ్వల్ మూవీని మార్కెట్ చేసేందుకు స్టార్ ఫార్ములాను ప్రయోగిస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో సూపర్ క్రేజ్ ఉన్న స్టార్స్ తో పుష్ప స్కేల్ పెంచుతున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ రేంజ్ పెంచేందుకు రామ్ చరణ్ అన్నయ్యని రంగంలోకి దింపుతున్నాడు సుక్కూ బాయ్.

 

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మల్టీలింగ్వల్ గా రూపొందుతోన్న సినిమా పుష్ప. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇక ఈ మూవీతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదగాలని టార్కెట్ పెట్టుకున్నాడు బన్నీ. సదరన్ స్టార్ మార్కెట్ ను మరింత పెంచేందుకు స్టార్ ఫార్ములా ప్రయోగిస్తున్నాడు సుకుమార్. 

 

అల్లు అర్జున్ ఆల్ రెడీ మలయాళంలో సూపర్ ఇమేజ్ ఉంది. అక్కడ మల్లు స్టార్ గా ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు. దీంతో తమిళ్ మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెడుతోంది పుష్ప యూనిట్. కోలీవుడ్ లో భారీ వసూళ్లు అందుకునేందుకు ఎక్కువగా తమిళ్ స్టార్స్ ను తీసుకుంటున్నారు. తమిళ్ స్టార్ ఆది పినిశెట్టీని ఒక కీ రోల్ కి తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. 

 

ఆది పినిశెట్టి ఇంతకుముందు అల్లు అర్జున్ సరైనోడులో విలన్ గా నటించాడు. అలాగే సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలంలో చెర్రీ అన్నయ్యగా నటించాడు ఆది. ఇప్పుడు తమిళ్ మార్కెట్ కు ప్లస్ అవుతుందని ఆదిని కూడా కాంటాక్ట్ చేసిందట పుష్ప. ఇక మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తాడని ఇంతకుముందు టాక్ వచ్చింది. అయితే విలన్ గా నటిస్తే తమిళ్ లో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని టాక్ వచ్చింది. అయితే విలన్ గా నటిస్తే తమిళ్ లో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని సేతుపతి ఆలోచిస్తున్నాడని.. పుష్ప ఆఫర్ ని హోల్డ్ లో పెట్టాడని ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: