రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ సినిమాలు తీయటంలో సిద్ధహస్తుడు అని అందరికి తెలుసు. ఏదో ఒక సమాజంలో ఉన్న ఎలిమెంట్ తీసుకుని మంచి కాంట్రవర్సి చేసి డబ్బులు దండుకోవడం లో ఆయనకు మించిన వారు మరొకరు ఉండరు అని చాలామంది చెబుతారు. ఇదే విధంగా ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మొత్తం క్లోజ్ అవ్వటంతో ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ అనే తన సంస్థ ద్వారా లాక్ డౌన్ టైం లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండటంతో ఎక్కువ హాట్ హాట్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రేక్షకుల ఫీలింగ్స్ క్యాష్ చేసుకోవడానికి రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే 2 శృంగార భరితమైన స్టఫ్ కలిగిన సినిమాలు ‘క్లైమాక్స్’, నగ్నం సినిమాలు రిలీజ్ చేసి భారీస్థాయిలో డబ్బులు దండుకున్నారు.

IHG

ఇప్పుడు తాజాగా ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులపై సెక్సీ హాట్ బాంబ్ సినిమాగా 'థ్రిల్లర్' టైటిల్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. 'నగ్నం' సినిమాలో పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన స్వీటీ అనే కొత్త అమ్మాయిని 'నగ్నం' సినిమాలో తీసుకోగా ఇప్పుడు తాజాగా ఒడిశా రాష్ట్రానికి చెందిన అప్సర రాణి అనే అమ్మాయిని 'థ్రిల్లర్' అనే సెక్సీ సినిమా కోసం ఆర్జీవి ఎంచుకున్నట్లు తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.IHG

కాగా అప్సర రాణికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. అప్స‌ర‌తో క‌లిసి డిన్న‌ర్ చేస్తూ.. త‌న‌తో స‌ర‌సాలాడుతూ కొన్ని ఫొటోలు వ‌ర్మ షేర్ చేశాడు. అవి చూసి కుర్రాళ్ల‌కు మతిపోగొడుతున్నయి. రాంగోపాల్ వర్మ మీద కొంతమంది కుర్రవాళ్ళు ఫోటోలు చూసి బీపీ తెచ్చుకుంటున్నారు. ఆర్జివి తెచ్చిన అప్స‌రా రాణి అందాలు చూసి చాలా మంది కుర్రాళ్ళు… దేవలోకంలో ఉండాల్సిన అప్స‌రా లు భూలోకంలో రామ్ గోపాల్ వర్మ కి బలే దొరుకుతారు అని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: