రేణూ దేశాయ్. బద్రీ సినిమా హీరోయిన్. ఆ సినిమాలో ఆమె పవన్ తో కలసి బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే అంటూ పాడే పాట, చేసిన డాన్స్ ఇరవై ఏళ్ళు గడచినా ఎవరూ మరచిపోలేరు. హై ఓల్టేజ్ సాంగ్ అది. పవన్ తో పాటు రేణూ డ్యాన్స్ మూమెంట్స్ ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఆ సాంగ్ కే హైలెట్.
ఇదిలా ఉండగా సామాజిక బాధ్యత బాగా ఉన్న రేణూ దేశాయ్ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటుంది. తాజాగా రేణూ దేశాయ్ అదే వేదికగా చేసుకుని ఈ దేశ ప్రజలకు హెచ్చరిస్తూ కొన్ని విలువైన సూచనలు చేశారు. మాంసం మానేయండి, మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలంటూ ఆమె చేసిన హెచ్చరిక లాంటి సూచన అంతా వినాల్సిందే.
ఇపుడు చైనా నుంచి మరో ప్రాణంతక వైరస్ బయట ప్రపంచానికి దూసుకువస్తోంది. బుబోనిక్ ప్లేగ్ వ్యాధి ఇపుడు చైనా స్టేజ్ త్రీ లో ఉందిట. అక్కడ కొన్ని ప్రాంతాలలో ఈ మహమ్మారి వణికిస్తోందిట. ఎలుకలను తిన్న పాపానికి ఈ వ్యాధి వచ్చిందట.
దాంతో రేణూ దేశాయ్ అందరికీ వినయపూర్వకంగా విన్నపాలు చేస్తున్నారు. మన ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే మనం మరింత ఇబ్బందులో పడతామని కూడా హెచ్చరించారు. మాంశం తినడంతో పాటు వింత వింత అలవాట్లు చేసుకుంటున్న వారు ఆఖరుకు ప్రక్రుతిలో ఉన్న క్రిమి కీటకాలను కూడా వదలడంలేదు.
ఎలుకలను, పిల్లులను, కప్పలను కూడా తింటున్నారు. దీని వల్లనే ఇలాంటి భయంకర వ్యాధులు వస్తున్నాయి. దీంతో రేణూదేశాయ్ సామాజిక సందేశం ఇచ్చారు. మనం ఎంతగా మారితే అంతగా సుఖంగా ఉంటామని చెప్పుకొచ్చారు. మరి ఇది ఈ జనం వింటారా. వినాలి. లేకపోతే ఇబ్బందులో పడేది ఈ లోకమే.