వాళ్లిద్దరు తండ్రీ కొడుకులు. కానీ అలా అనిపించరు. మాంచి ఫ్రెండ్స్ లా కనిపిస్తారు. ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నట్టుండి శత్రువులు అయిపోయారు. కక్ష పెంచుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. బద్ద శత్రువులుగా మారిన ఆ తండ్రీ కొడుకులు ఎవరో కాదు విక్రమ్, ధృవ్. 

 

అంతలా కలిసిమెలిసి ఉన్న తండ్రీ కొడుకులు ఎలా విడిపోయారనుకుంటున్నారా.. ఇది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో మాత్రమే. ధృవ్ హీరోగా నటించే సినిమాలో విక్రమ్ విలన్ గా నటించనున్నాడట. ఈ సినిమా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కనుంది. డైెరెక్టర్ ప్రస్తుతం ధనుష్ హీరోగా తీసిన జగమే తంత్ర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. 

 

అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో ధృవ్ హీరోగా పరిచయమయ్యాడు. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. నటుడిగా ధృవ్ కు గుర్తింపు తీసుకొచ్చింది. రెండో సినిమా ఇంకా మొదలు కాలేదు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సినిమా త్వరలో మొదలు కానుంది. ఇందులో విలన్ గా విక్రమ్ కనిపిస్తాడట. రావన్ తర్వాత విక్రమ్ విలన్ గా నటించే సినిమా ఇదే అవుతుంది. 

 

యాక్టింగ్ లో విక్రమ్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ధృవ్ కు ఒక్క సినిమా అనుభవమే ఉన్నా.. పెర్ ఫార్మెన్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే విక్రమ్ ఫ్యాన్స్ కు పండుగే. పోటాపోటీగా ఇచ్చే రెస్పాన్స్ అభిమానులకు జ్ఞాపకంలా మిగిలిపోవడం ఖాయం. మొత్తానికి రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ లా ఉండే తండ్రీ కొడులు.. రీల్ లైఫ్ లో బద్ద శత్రువుల్లా నటించనున్నారు. విక్రమ్.. తన కొడుకు ధృవ్ కు ఏదొక విధంగా స్టార్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: