యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. యువి క్రియోషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. ఒక డిఫ్రెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుండగా సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ కి సిస్టర్ గా నటిస్తుంది. రాధే శ్యాం అన్న టైటిల్ ని చిత్ర బృందం అనుకుంటున్నప్పటికి ఇంతవరకు ఈ సినిమా నుండి ప్రభాస్ లుక్ గాని టైటిల్ ని గాని యూనిట్ రిలీజ్ చేయలేదు. ఇదే ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంత నిరాశని కలిగిస్తోంది.

 

ఇక ఈ సినిమా తర్వాత ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ భారీ బడ్జెట్ తో నిర్మించే పాన్ ఇండియా సినిమాలో నటించనున్నాడు. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా వైజయంతి మూవీస్ కి 50 వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకోసం ఈ నిర్మాణ సంస్థ 400 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాస్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

 

అయితే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటించడానికి అవకాశాలొచ్చాయని అన్నారు. కాని ప్రభాస్ ఇంకా టాలీవుడ్ లో భారీ సినిమాలు చేశాకే బాలీవుడ్ కి వెళ్ళాలనుకున్నాడు. ప్రభాస్ ఓకే అంటే ధూమ్ సిరీస్  4వ భాగాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాలని మేకర్స్ అనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ కష్టమే అని తెలుస్తుంది. కరోనా కారణంగా నెలకొన్న ఈ క్లిష్ఠ పరిస్థితుల నుంచి గట్టెక్కి ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీటయ్యాకే కొత్త ప్రాజెక్ట్స్ మొదలయ్యో అవకాశాలున్నాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: