దేశంలో కరోనా విస్తృతి బాగా పెరిగిపోయింది. సామాన్యుడి నుండి విఐపి, వివిఐపి వరకు మహమ్మారి బారిన పడనివారు లేరు. తాజాగా కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దీని ప్రభావానికి గురి అయ్యారు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లోని టెక్ మహీంద్రా సాఫ్ట్వేర్ కార్యాలయం తాత్కాలికంగా మూతపడింది. భువనేశ్వర్ నగరంలోని ఆఫీసులో జూన్ 29 మొదటి కరోనా కేసు నమోదయింది.

 

దీంతో మిగతా ఉద్యోగులకు బుధవారం కరోనా టెస్టులు జరుపగా ఏడుగురు ఉద్యోగులు దాని బారిన పడినట్లు తెలిసింది. దీంతో టెక్ మహేంద్ర క్యాంపస్ ను మూసివేస్తున్నట్లు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వారు వెల్లడించారు. ఇప్పటి వరకు 65 మంది హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఏడుగురు వ్యక్తులతో పరిచయం ఉన్న ఇతరులను కూడా వేరు చేయడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది.

 

ఉద్యోగులు ఎవరైనా లక్షణాలు కలిగినట్లు అనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుంటారని కూడా పేర్కొన్నారు. కోవిడ్-19 కేసులను గుర్తించిన తరువాత శానిటైజేషన్ కోసం గురువారం వరకు సంస్థ కార్యాలయాన్ని 72 గంటలు మూసి వేసినట్లు బీఎంసీ నార్త్ జోనల్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రస్టీ పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా ఒడిశాలో కొవిడ్-19 కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం 572 కేసులు నమోదవగా ఆరుగురు మృతి చెందారు. దీంతో  10వేల మార్కును దాటింది.  రాష్ట్రంలో ఇప్పటివరకు 10,097 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 42 మంది మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: