మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'దృశ్యం' సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడం మరియు హిందీ భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ వసూళ్లను సాధించింది. అంతేకాకుండా ప్రశంసలను కూడా పొందింది. ఆఖరికి చైనా భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మలయాళంలో కమర్షియల్ హిట్ అయిన ఈ సినిమా కి తాజాగా మోహన్ లాల్ సీక్వెల్ చేయటానికి రెడీ అయ్యారట.

IHG

కేరళలో ప్రస్తుతం సినిమా షూటింగ్లకు అనుమతి లభించక పోవడంతో ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ డిస్కషన్ లో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమా డైరెక్టర్ జీతు జోసెఫ్ సెకండ్ పార్ట్ అంటే ఏదో సీక్వెల్ టైటిల్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం కాదని 'దృశ్యం' సినిమా ఎక్కడితో ఎండ్ అయిందో అక్కడి నుంచి మరొక స్టార్టింగ్ ఉండేలా సీక్వెల్ పార్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

IHG

ఫ‌స్ట్ పార్ట్ సినిమాలో కుర్రాడి మృత‌దేహాన్ని హీరో ఎక్క‌డ పూడ్చాడో ప్రేక్ష‌కుడికి క్లూ ఇచ్చి ముగించారు. ఇంకా కేసు పూర్తిగా పిలవలేదని కొత్త పోలీస్ ఆఫీసర్ హీరోకి చెబుతాడు. ఆ మేరకు విచారణ ఎలా కొనసాగుతుంది సినిమా స్టోరీ ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనే రీతిలో సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఉంటుందని డైరెక్టర్ జీతు జోసెఫ్ ఇటీవల తెలిపారు. 'దృశ్యం' సెకండ్ పార్ట్ మరి మొదటి భాగంలో అలరిస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: