టాలీవుడ్ లో సక్సెస్ ఉన్నా సరే లక్ కలిసి రాని దర్శకుల్లో సురేందర్ ఋఎడ్డి ఒకరు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి మ్యాక్సిమం హిట్లు అందుకున్న ఈ డైరక్టర్ మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా చేసిన తర్వాత వెంటనే స్టార్స్ అంతా ఆయన కోసం క్యూ కడతారు అనుకుంటే అలా ఏమి జరుగలేదు. సైరా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో ప్రభాస్ తో సినిమా కోసం ప్రయత్నించాడు సురేందర్ రెడ్డి. కాని అది వర్క్ అవుట్ కాలేదు. తనలాంటి మాస్ డైరక్టర్ ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేస్తే చూడాలని ఎప్పటినుండో సిని ప్రియులు ఎదురుచూస్తున్నారు.

 

ఇక ప్రభాస్ డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల మళ్లీ తన ప్రయత్నాలు ఆపేసిన సూరి ఫైనల్ గా ఎనర్జిటిక్ స్టార్ రాం తో ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాం లాంటి హీరో సినిమా అంటే కచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. సైరా తర్వాత వెయిట్ చేసినా కూడా మంచి ప్రాజెక్టే చేస్తునాడు సురేందర్ రెడ్డి. అయితే ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాను డైరక్టర్ క్రిష్ నిర్మిస్తాడట.

 

ఫస్ట్ ఫ్రేం ప్రొడక్షన్ లో ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. సైరా తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోలతో కథా చర్చలు జరిపినా ఫైనల్ గా రాం ఒక్కదే సురేందర్ రెడ్డితో సినిమాకు ఓకే చెప్పాడట. సురేందర్ రెడ్డి హీరోల లిస్ట్ లో తర్వాత వరుణ్ తేజ్ ఉన్నాడని తెలుస్తుంది. మరి రాం సినిమా హిట్టు కొడితే ఈసారి వెంటనే మరో సినిమా చేసే ఛాన్స్ వస్తుదేమో చూడాలి.        

మరింత సమాచారం తెలుసుకోండి: