ప్రభాస్ 20వ సినిమా నుండి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ లవ్ డ్రామా రూపొందుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకి తాజా వార్త ఒక బూస్ట్ అప్ లా అవ్వనుంది. నేషనల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాకి జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

అయితే ఈ సినిమాకి సంగీతం అందించేది ఎవరనేది ఇంతవరకూ ఒక క్లారిటీ రాలేదు. మొదట్లో బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడని చెప్పారు. కానీ ఈ విషయంలో నిజం లేదని అమిత్ త్రివేది స్పందించిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్న్ పేరు బయటకి వచ్చింది. జస్టిన్ ప్రభాకరన్ తెలుగులో డియర్ కామ్రేడ్ చిత్రానికి సంగీతం అందించాడు. అయితే తాజాగా మరో సంగీత దర్శకుడి పేరు బయటకి వచ్చింది.

IHG

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన జూలియస్ ప్యాకియం ప్రభాస్ 20వ సినిమాకి సంగీతం అందించనున్నాడని అంటున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న జూలియన్ ప్యాకియం ప్రభాస్ చిత్రానికి వర్క్ స్టార్ట్ చేసాడని సమాచారం. అయితే ఇప్పటి వరకూ ఈ విషయమై ఎలాంటి అధికరిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే.

 

ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే నిజమైతే అక్టోబర్ వరకూ వేచి చూడక తప్పదు. చూడాలి మరేం జరుగుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: