కరోనా మహమ్మారి సృష్టిస్తున్న సంక్షోభం అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న జీవితాల్లోకి సుడిగాలిలా వచ్చి అతలాకుతం చేసేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఇప్పుడప్పుడే కరోనా ఉధృతి తగ్గేలా లేదు. రోజు రోజుకీ కేసులు పెరుగుతూనే పరిస్థితి మరింత దిగజారుతుంది. కరోనా కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. అలా కోల్పోయిన వారిలో సినిమావాళ్ళు కూడా ఉన్నారు. థియేటర్లు మూతబడి, షూటింగులు లేక సెలెబ్రిటీలందరూ ఇంటిదగ్గరే ఖాళీగా ఉన్నారు. 

 

అయితే ఆ ఖాళీ టైమ్ లో కొందరు కొత్త కొత్త నైపుణ్యాలని నేర్చుకుంటున్నారు. తెలుగులో హీరోయిన్లుగా నిలబడదామనుకున్న వారు తెలుగు భాషని నేర్చుకుంటున్నారు. మరికొందరేమో తమ నైపుణ్యాలని మరింతగా పెంచుకుంటున్నారు. అయితే భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న రష్మిక మందన్న షూటింగులు లేక బోర్ కొట్టడంతో సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.

తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో అభిమానులకి ఒకానొక టెస్ట్ పెట్టింది. సెట్ నీ, కారవాన్ ని బాగా మిస్ అవుతున్నానని తెలిపిన రష్మిక తను నటించిన సినిమాల్లో నుండి కొన్ని ప్రశ్నలని వేసింది. ఇప్పటి వరకూ తాను ఎన్ని సినిమాల్లో నటించానో చెప్పమని కోరింది. ఇంకా సూపర్ హిట్ ఫిలిమ్ భీష్మ సినిమాలో తన పాత్ర ఏ కంపెనీలో వర్క్ చేసిందో ఆ కంపెనీ పేరు చెప్పడంటూ ప్రశ్నించింది. 

IHG

అంతే కాదు కిరాక్ పార్టీలో తన పేరు చెప్పమని సోషల్ మీడియా వేదికగా అభిమానులకి టెస్ట్ పెట్టింది. మొత్తానికి ఇంట్లోనే కూర్చుని బోరింగ్ గా ఫీలవడంతో తన అభిమానులని టెస్ట్ చేసి, కాసేపు అభిమానులని ఎంటర్ టైన్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: