బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతుంటే వాళ్లను అడ్డుకునేందుకు మరొకరు ప్రయత్నిస్తుంటారు, గతంలో ఇదే విషయం మీద చాలా సార్లు చర్చ జరిగింది. ముఖ్యంగా హీరోయిన్‌ల విషయంలో ఇలాంటి ఆరోపణలు తరుచూ వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఇండస్ట్రీలోని నెపోటిజం అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్‌ సినీ పరిశ్రమలోని లోపాల మీద భారీగాచర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ రంగంలో వారసత్వం కారణంగా కొత్తగా వచ్చే వారు ఎలా ఇబ్బంది పడుతున్నారో ప్రధానం చర్చకు వచ్చింది. ఈ నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంపై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తమకు గతంలో ఎదురైన అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

 

తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి రవీనా టండన్‌ తనకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకుంది. బాలీవుడ్‌లో నటీనటులను దెబ్బతీసేందుకు కొంత మంది ఎదురుచూస్తుంటారని, తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. `ఓ సినిమాలో నటించేందకు నేను హీరోయిన్‌గా ఎంపిక అయ్యా. అంతా రెడీ అయ్యింది. ముహుర్తం కార్యక్రమానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నా.. డిజైనర్స్‌ డ్రెస్‌ కూడా రెడీ చేశారు. అంతలోనే యూనిట్ సభ్యుల నుంచి నన్ను తీసేసినట్టుగా కాల్ వచ్చింది.

 

దీంతో నేను షాక్‌ అయ్యా.. ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తరువాత నాకు అసలు విషయం తెలిసింది. హీరో గర్ల్‌ ఫ్రెండ్‌కు నేను నచ్చలేదని నన్ను సినిమా నుంచి తొలగించినట్టు తెలిసింది. ఈ విషయం తెలియగానే నాకు మరింత షాక్‌ అనిపించింది. సినీ రంగంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి నుంచి ఇలాంటి అనుభవాలకు సర్ధుకుపోవటం నేర్చుకున్నా అంటూ కామెంట్ చేసింది రవీనా.

మరింత సమాచారం తెలుసుకోండి: