రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా ఒకదానిని మించేలా మరొక సినిమా ఎంతో గొప్ప విజయాలు అందుకోవడం తోపాటు భారీ స్థాయిలో వందల కోట్ల కలెక్షన్ ని అందుకుని తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వెలుగెత్తి చాటాయి. ఇక ఆ సినిమాల అనంతరం హీరో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ మరియు మార్కెట్ రేంజ్ ని సంపాదించారు. వాటి తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమా కూడా ఎంతో భారీ బడ్జెట్ తో రూపొంది అదే విధమైన భారీ స్థాయిలో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. 

IHG

దానితో కొంత ఆలోచనలో పడ్డ ప్రభాస్, ఎలాగైనా తన తదుపరి సినిమాతో మంచి హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని భావించి, నెక్స్ట్ మూవీ ని యువి క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్స్ పై యువ దర్శకుడు రాధాకృష్ణతో సినిమా మొదలెట్టారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ప్రేమపావురాలు హీరోయిన్ భాగ్యశ్రీ, ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

 

ఇకపోతే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇప్పటివరకు రిలీజ్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొద్దిరోజులుగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కొంత ఆవేదనతో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఎట్టకేలకు వారు కోరుకుంటున్న రోజు రానే వచ్చింది. ప్రభాస్ 20 టైటిల్, ఫస్ట్ లుక్ ని ఈనెల 10వ తేదీన సరిగ్గా 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు కాసేపటి క్రితం నిర్మాతలు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానితో ఒక్కాసారిగా మన డార్లింగ్ ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరుస్తోంది. కాగా ఈ సినిమాకు రాధేశ్యామ్, ఓ డియర్ టైటిల్స్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: