ముందుగా కొన్నేళ్ల క్రితం ఈటివి ఛానల్ లో ప్రసారమైన ఢీ డ్యాన్సింగ్ షో లో డాన్సర్ గా మంచి పేరు సంపాదించిన సాయి పల్లవి, ఆ తరువాత ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమయింది. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హిట్ అందుకున్న సాయి పల్లవి, ఆ సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న సాయి పల్లవి, ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వంతో పాటు మరొక్కసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తోంది. ఇకపోతే అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

IHG

ఈ విషయమై అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఒక కీలకమైన విద్యార్థి నాయకుడి రోల్ ఉందని, కాగా ఆ రోల్ కు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను తీసుకోవాలని తాము భావిస్తున్నట్లు ఇటీవల మెగాస్టార్, దర్శకుడు కొరటాల పలు ఇంటర్వ్యూ ల్లో భాగంగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఆయన దృష్టి అంతా ఆ సినిమాపైనే ఉందని, అందువలన ఈ పరిస్థితుల్లో ఆయన్ను మరింతగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని కొరటాల, ఆ పాత్ర కోసం మహేష్ ని తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే ఈ రోల్ విషయమై ఒకానొక సందర్భంలో మహేష్ కు చెప్పగా, అవసరం అయితే మీకు నేనున్నాను అంటూ ఆయన మాటిచ్చినట్లు గతంలో కొరటాల చెప్పారు. 

 

సో, దీనిని బట్టి ఆ స్పెషల్ రోల్ లో మహేష్ ను తీసుకునే అవకాశం ఉందని, మరోవైపు ఆయన నటించనున్న తదుపరి సినిమా సర్కారు వారి పాట షూటింగ్ మొదలు కావడానికి మరొక రెండు నెలలు సమయం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా సినిమాలో ఆ పాత్రకు ఒక హీరోయిన్ కూడా ఉంటుందని చెప్పిన కొరటాల, ఆ పాత్ర కోసం సాయి పల్లవిని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం వాడుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు తెలియాలి అంటే ఆచార్య టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.....!!  
 

మరింత సమాచారం తెలుసుకోండి: