ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ కలసి సంయుక్తంగా ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ అతి త్వరలో జరుపుకోనున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు అఫీషియల్ గా రిలీజ్ చేయనున్నారు. 

IHG

ఇకపోతే ఈ సినిమా తరువాత మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. సైన్స్ ఫిక్షన్ కథగా ఎంతో భారీ లెవెల్లో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దర్శకుడు అశ్విన్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటివరకు చేయని ఒక సరికొత్త పాత్ర ఈ సినిమాలో పోషించబోతున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక బాలీవుడ్ భామను తీసుకునేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. 

 

ఇటీవల ప్రభాస్ నటించిన సాహోలో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కాగా నాగ అశ్విన్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవడానికి ఒక కారణం ఉందని, ఎంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమా తెరకెక్కనుండడంతో నార్త్ భామ అయితే సినిమాకు మార్కెట్ పరంగా కూడా మంచి బూస్ట్ వస్తుందని యూనిట్ భావిస్తోందట. మరి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని చెప్పకతప్పదు....!!

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: