ఈ మద్య ఒకటీ రెండు సినిమాలతోనే బాగా పాపులర్ తెచ్చుకుంటున్నారు కొంత మంది హీరో, హీరోయిన్లు.  పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్ ఎక్స్ 100' మూవీలో తన నటనతో పాటు తన అందచందాలతో కుర్రకారు హృదయాలను దోచుకున్న అందాల ముద్దుగుమ్మ. పాయల్ ఆ సినిమాలో నటించి సూపర్ స్టార్ డమ్‌ను సంపాదించింది.  వెంకటేశ్ సరసన వెంకీ మామ, రవితేజ పక్కన డిస్కో రాజాలో నటించి ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. లాక్ డౌన్ తో అందరు నటుల్లాగే ఖాళీగా ఉన్న పాయల్.. ఫస్ట్ టైమ్ ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించింది.  గృహ హింస కథాంశంతో తెరకెక్కిన రైటర్ కు పాయల్ బాయ్ ఫ్రెండ్ గా రూమర్స్ వచ్చిన సౌరభ్ ధింగ్రా డైరెక్షన్ వహించాడు.

 

ఈ అమ్మడెు ప్రస్తుతం వెండితెరపై మళ్లీ ఫోకస్ పెట్టింది. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్‌లో తనకు ఓ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పని చేయాలని ఉందని వారిలో ఒకరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని.. మరోకరు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు మంచి ఫామ్ లో కొనసాగుతున్న హీరోలన్న సంగతి తెలిసిందే. 

 

ఈ ఇద్దరు హీరోలతో  ఈ కలిసి నటించాలని ఉందని, త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నట్లుగా పాయల్ రాజ్‌పుత్ తెలిపింది. ఇక హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. నటి రమ్యకృష్ణతో కూడా కలిసి నటించాలనేది తన డ్రీమ్ అని పాయల్ తెలిపింది. ఆమె నటనలో గంభీరం ఉంటుందని.. ఎలాంటి పాత్రలైనా అలవోకగా చేస్తుందని అన్నారు. ఇక దర్శకుల విషయానికి వస్తే.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్  సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ ఉందని అంటూ తన మనసులోని కోరికలన్నీ చెప్పింది.  ఏది ఏమైనా ఈ బ్యూటీ కోరికలు బాగానే ఉన్నాయని అభిమానులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: