కరోనా బీభత్సం వల్ల షూటింగ్ కు లాంగ్ బ్రేక్ వచ్చింది. ప్రభుత్వం షూటింగ్స్ కు ఓకే చెప్పినా కరోనా తీవ్రత పెరగడంతో ఎవరు షూటింగ్స్ కు డేర్ చేయట్లేదు. అయితే ఇలాంటి టైంలో వర్మ లాంటి డైరక్టర్ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆయన కాకుండా ఈ టైంలో బిజీగా ఉన్న మరో డైరక్టర్ ఎవరంటే క్రిష్ అంటున్నారు. గమ్యం, వేదం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్న క్రిష్ లేటెస్ట్ గా నిర్మాతగా మారి వెబ్ సీరీస్ లను చేస్తున్నాడు.

 

లాక్ డౌన్ టైం లో క్రిష్ నిర్మించిన 3 వెబ్ సీరీస్ లు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు సినిమా దర్శకులతో కూడా వెబ్ సీరీస్ లను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓ పక్క డైరెక్ట్ చేస్తూనే నిర్మాతగా ఫుల్ టైం బిజీగా మారాలని చూస్తున్నాడు క్రిష్. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఓ సినీమ ను నిర్మించే ప్లాన్ లో ఉన్నాడట. డిజిటల్ ఫ్లాట్ ఫాం లో వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ లకు డిమాండ్ ఉంటుందని ముందే ఊహించిన క్రిష్ న్నిర్మాతగా వెబ్ సీరీస్ లను నిర్మిస్తున్నాడు.

 

క్రిష్ బాటలో మరికొంతమంది దర్శకులు కూడా ఓటిటి ఫ్లాట్ ఫాం ను ఎంచుకుంటున్నారు. క్రిష్ తర్వాత టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ హరీష్ శంకర్ కూడా ఓటిటి లో వెబ్ సీరీస్ లను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ అయ్యప్పునుం కోషియం సినిమా రీమేక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. వెంకటేష్, రానా కలిసి చేసే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ స్టేట్మెంట్ త్వరలో రాబోతుందట. ఇక క్రిష్ మాత్రం ప్రస్తుతం పవర్ స్టార్ తో విరూపాక్ష సినిమా ప్లాన్ చేశాడు.      

మరింత సమాచారం తెలుసుకోండి: