కరోనా కారణంగా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఏడాదికో సినిమాలో నటించే హీరోలు కరోనాకు భయపడిపోయి.. సెట్స్ పైకి వెళ్లడం లేదు. కొత్త కమిట్ మెంట్స్ లేకపోవడంతో సంపాదన తగ్గింది. ఇక బన్నీ పుష్ప విషయానికొస్తే చాలా నష్టాలు వెంటాడుతున్నాయి. 

 

పుష్ప సిినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ షూట్ చేశారే గానీ.. ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం కావడంతో.. చాలావరకు షూటింగ్ అడవుల్లో తీయాలి. ఇప్పుడు అక్కడికెళ్లి తీసే పరిస్థితి లేదు. అన్నపూర్ణ ఏడెకరాలను అడవిగా తీర్చిదిద్దుతున్నారని తెలిసింది. 

 

బన్నీ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి ఎంపికయ్యాడు. షూటింగ్ లేటవడంతో.. డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నాడు. పుష్ప పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. విజయ్ ఉంటే తమిళం మార్కెట్ దక్కుతుందని భావించారు నిర్మాతలు. విజయ్ తప్పుకోవడంతో.. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టిని సంప్రదించారట. కరోనా పరిస్థితుల్లో వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ప్రస్తుతం పుష్పలో విలన్ పోస్ట్ ఖాళీగా ఉంది. 

 

పుష్ప బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో.. బాలీవుడ్ లోకి ఓ రేంజ్ లో సినిమాను తీసుకెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో ఐటం గర్ల్ గా దిశా పటానీని ఎంపిక చేసినట్టు తెలిసింది. కరోనా తర్వా మారిన పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ కంట్రోల్ చేయడానికి మరో ఐటం గర్ల్ ను వెతికే పనిలో ఉన్నాడు దర్శకుడు. మొత్తం మీద నటీనటులుగా బన్నీ, రష్మిక పేర్లు తప్ప మరో పేరు కన్పార్మ్ కాలేదు. మొత్తానికి కరోనా దెబ్బకు ప్రొడ్యూసర్స్ నష్టాలను చవిచూస్తున్నారు. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని షూటింగ్ లకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో కరోనా వాళ్ల ఆశలను అడియాశలు చేసింది. షూటింగ్ లకు పర్మీషన్స్ వచ్చినా పెరుగుతున్న కేసులు నటీనటులను తెగ భయపెట్టిస్తున్నాయి. దీంతో షూటింగ్ కు వెళ్తే ఏంటో.. వెళ్లక పోతే ఏంటో అని సతమతమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: