సుశాంత్ సింగ్ చనిపోయి నెల కావొస్తున్నా.. బాలీవుడ్ లో ఇప్పటికీ ఇతని పేరే వినిపిస్తోంది. లోకాన్ని విడిచి వెళ్లిపోయినా.. తన చివరి చిత్రం దిల్ బేచారాతో ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ లో హేమాహేమీల్లాంటి ఖాన్ త్రయం ఉన్నా.. బాహుబలితో ఇండియా మొత్తాన్ని ఆకట్టుకున్న రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు ఉన్నా.. ఆ రికార్డ్ మాత్రం.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కే సొంతమవుతుంది. 

 

సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ నే కాదు.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను కలిచివేసింది. ఈ యంగ్ హీరో మరణంతో.. నెపోటిజం వార్తలు నెల రోజులుగా వస్తూనే ఉన్నాయి. సుశాంత్ మరణానికి కారణం ఏదైనా గానీ.. వెండితెర ఓ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ ను పోగొట్టుకుంది. సుశాంత్ సింగ్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారాను ఓటీటీ ప్లాట్ ఫామ్ లో హాట్ స్టార్ లో ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నాడు ట్రైలర్ ను రిలీజ్ చేస్తే.. ఎక్కువ లైక్స్ తో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 24గంటల్లో 32 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 

 

ఇది పెద్ద రికార్డ్ కాకపోయినా.. 6.4 మిలియన్ లైక్స్ రావడం విశేషం. ఇంతవరకు ఇండియాలో ఏ ట్రైలర్ కూ రాని లైక్స్ దిల్ బేచారా సంపాదించింది. సుశాంత్ సింగ్  మీద ఉన్న సానుభూతి.. ప్రేమ ఏదైనా కానీ.. నెటిజన్లు లైక్స్ రూపంలో చూపించారు. 

 

నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న దిల్ బేచారలో సుశాంత్ సింగ్ సరసన సంజన సంఘీ నటించింది. ట్రైలర్ లోనే కథ అంతా చెప్పేశారు దర్శకుడు ముఖేష్ చాబ్రా. ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ట్రైలర్ తోనే రికార్డ్ క్రియేట్ చేసిన సుశాంత్ ఓటీటీలో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: