వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే పవన్ లేకుండానే ఓ షెడ్యూల్ పూర్తి చేశాడట క్రిష్. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ మూవీగా వస్తుందని అంటున్నారు. కెరియర్ లో మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు విరూపాక్ష టైటిల్ పెడుతున్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. కాని లేటెస్ట్ గా సినిమా టైటిల్ అది కాదంటూ మళ్లీ న్యూస్ వైరల్ గా మారింది. పవన్, క్రిష్ కాంబోలో వచ్చే సినిమాకు బందొపోటు, గజదొంగ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.

 

సో టైటిల్ ను బట్టి చూస్తుంటే పవన్దొంగ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురు, శాతకర్ణి సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాను మాత్రం నిరాశపరచాడు. అందుకే కొద్దిపాటి గ్యాప్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని తెలుస్తుంది. సినిమా కోసం భారీ సెట్లు వేస్తున్నారు. వకీల్ సాబ్ కోసం పవన్ మరో 10 రోజులు షూట్ చేయాల్సి ఉందట. అది పూర్తికాగానే క్రిష్ సినిమాకు డేట్స్ ఇస్తాడట.

 

హిస్టారికల్ మూవీ అయినా అనుకున్న విధంగా.. అనుకున్న టైం లో సినిమా చేయడంలో క్రిష్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటాడు. అయితే కరోనా లాక్ డౌన్ కొద్దిగా డిస్ట్రబ్ చేసినా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని తెలుస్తుంద్. పవన్, క్రిష్ వెండితెర మీద మరో అద్భుతాన్ని సృష్టిస్తారని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.                      

మరింత సమాచారం తెలుసుకోండి: