స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది. అది కొందరికి ఒకటి రెండు సినిమాలతోనే ఛాన్స్ వస్తే మరికొందరికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. సంవత్స్రాలకు సంవత్సరాలు వారి కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ స్టార్స్ కు వాళ్లా వాళ్ల కమిట్మెంట్స్ ఉంటాయనుకోండి. లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ తో నాగ్ అశ్విన్ ఓ క్రేజీ సినిమా ప్లాన్ చేశాడని తెలిసిందే. ఈ సినిమాను అశ్వనిదత్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా కోసం సిద్ధమయ్యాడు.

 

విషయం ఏంటంటే 2007లోనే ప్రభాస్ కోసం కథ సిద్ధం చేసుకున్నాడట నాగ్ అశ్విన్. ప్రభాస్ ఇమేజ్ కు సరిపోయే ఓ క్రేజీ లైన్ నాగ్ అశ్విన్ అప్పటినుండే మదిలో ఉందట. అది రాసుకుని భద్రంగా పెట్టుకుని తను ప్రభాస్ ను డైరెక్ట్ చేఅగలిగే ఇమేజ్ వచ్చినప్పుడు చెబుదామని అనుకున్నాడు. లక్కీగా రెండు సినిమాలకే ఆ ఛాన్స్ కొట్టేశాడు నాగ్ అశ్విన్. ముఖ్యంగా మహానటి సినిమాను డైరక్టర్ డీల్ చేసిన విధానం ది బెస్ట్ అనిపించుకుంది. అందుకే అతని సినిమా అంటే మరో ఆలోచన లేకుండా ఓకే చేశాడు ప్రభాస్.

 

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. రాధాకృష్ణ మూవీకి రాధే శ్యాం టైటిల్ పరిశీలనలో ఉంది. రేపు అనగనా జూలై 10 ఉదయం 10 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై అంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.      

 

మరింత సమాచారం తెలుసుకోండి: