సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస బ్లాక్ బస్టర్ల తర్వాత చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ మంచి స్పందన వచ్చింది కూడా. ప్రీ లుక్ పోస్టర్లో మహేష్ చాలా స్టైలిష్ గా కనబడ్డాడు.

 

 

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుండి మొదలవుతుందని అంటున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో చిత్రీకరణకి వెళ్లడం కంటే పూర్తిగా కరోనా నియంత్రణలోకి వచ్చాకే షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారట. అందువల్ల మహేష్ ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్నాడు. కరోనా సంబంధిత విషయాల్లో సోషల్ మీడియా ద్వారా అభిమానులకి టచ్ లో ఉంతూ అవగాహన కల్పిస్తున్న మహేష్ బాబు గత కొన్ని రోజులుగా తన పిల్లలతో సరదాగా గడిపిన క్షణాలని షేర్ చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ బాబు ఒకానొక వెబ్ సిరీస్ ని రికమెండ్ చేస్తున్నాడు..

 

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ అత్యంత ప్రజాదరణ పొందింది. డార్క్ అనే టైటిల్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సిరీస్ ని చూసిన మహేష్ బాబు రైటింగ్, ఎగ్జిగ్యూటింగ్ బాగున్నాయంటూ ఈ సిరీస్ ని చూడండని రికమెండ్ చేసాడు. నెట్ ఫ్లిక్స్ లోనే టాప్ రేటింగ్స్ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ మహేష్ కి నచ్చిందంటే ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వెంటనే చూసెయ్యరూ..

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#DARK !! Unbelievably conceived, written and executed!! Strongly recommend watching the original German version with english subtitles 👌👌👌

A post shared by mahesh Babu (@urstrulymahesh) on

మరింత సమాచారం తెలుసుకోండి: