రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ఎక్కువగానే ఉంది. ఈ చిత్రంలో కృష్ణం రాజు ,భాగ్య శ్రీ ,ప్రియదర్షి, మురళి శర్మ , షాషా ఛత్రి తోపాటు బాలీవుడ్ నటులు సచిన్ కెడ్కర్, కునాల్ రాయ్ కపూర్ అలాగే తమిళ హాస్య నటుడు సత్యాన్ కీలక పాత్రల్లో నటించనున్నారని సమాచారం. ఇక మనోజ్ పరమహంస ఈసినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సంగీత దర్శకుడిని మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. ఇదిలావుంటే రేపు ఉదయం 10గంటలకు ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదలకానుంది. 
 
1970 బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ఇంకా 90రోజుల షూటింగ్ బ్యాలన్స్ వుంది. అన్ని కుదిరితే ఆగస్టు నుండి  తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ లను నిర్మిస్తున్నారు. తెలుగు తోపాటు తమిళ ,మలయాళ హిందీ భాషల్లో వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుండగా హిందీలో ఈచిత్రాన్ని టి సిరీస్ విడుదలచేయనుంది.
 
ఇక ఈసినిమా తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్  డైరెక్షన్ లో నటించనున్నాడని తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మించనుంది. వైజయంతి మూవీస్ కు ఇది 50వ సినిమా కావడం విశేషం. వచ్చే ఏడాది ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుండగా  2022 చివర్లో విడుదలకానుంది. ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా నటించనుందని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: