ఏది ఎలా ఉన్నా సరే టాలీవుడ్ లో ఇప్పుడు చిరంజీవి సినిమాలు హాట్ టాపిక్. ఆయన వరుసగా సినిమాలు చేయడమే కాకుండా ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు. ఆయన దూకుడుగా సినిమాలు చేయడం చూసి యువ హీరోలు కూడా ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఆయన ఎందుకు ఇంత దూకుడుగా చేస్తున్నారో తెలియదు గాని దాదాపు ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ కూడా యువతను టార్గెట్ చేస్తూ వస్తున్నావే అని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఆచార్య అనే సినిమాను చేస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఆయన లూసిఫర్ సినిమాలో నటిస్తున్నారు. సుజిత్ దర్శకుడిగా వస్తున్న ఈ సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమాకు నిర్మాత కూడా రామ్ చరణ్. ఆచార్య సినిమాను కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది  ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అని ముందు అనుకున్నా ఆచార్య సినిమా ఈ ఏడాది అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఇక ఈ సినిమాలో మలయాళ `లూసిఫర్‌`లో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో విజయ్ దేవరకొండ చేసే అవకాశం ఉంది అని టాక్. 

 

వాస్తవానికి ఆ పాత్రను... ముందు అల్లు అర్జున్ చేసే అవకాశం ఉంది అని టాక్ వచ్చింది. కాని బన్నీ పుష్ప సినిమాలో బిజీ గా ఉన్న నేపధ్యంలో ఆ పాత్రలో విజయ్ ని తీసుకున్నాడు అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది అనే దాని మీద చాలానే చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో  అల్లు అర్జున్ నటించడానికి ఆసక్తి చూపించలేదు అని అందుకే అతన్ని ఎంపిక చేసారు అని కూడా కొందరు అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: