బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ మరణం కి కారణం ఎవరూ అనే దాని మీద ఇప్పుడు బాలీవుడ్ తో పాటుగా అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. సుశాంత్ ని కొందరు బాలీవుడ్ ప్రముఖులు మానసికంగా వేధించారు అని ఆ వేదన తట్టుకోలేక సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే ప్రచారం బాగానే  జరిగింది. అక్కడ ఖాన్ త్రయం తో పాటుగా కరణ్ జోహార్ అదే విధంగా బన్సాలి వంటి వారు కూడా ఎక్కువగా అతన్ని వేధించారు అని అది తట్టుకోలేక అతను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అని అన్నారు. 

 

ఇక కరణ్ జోహార్ టార్గెట్ గా చాలా మంది విమర్శలు చేసారు. తాజాగా కరణ్ జోహార్  బాగా మానసికంగా ఆబాధ పడుతున్నాడని అంటున్నారు బాలీవుడ్ లో చాలా మంది. అతనిని కొందరు మానసికంగా  వేధించారు అని సినీ పరిశ్రమలో కూడా అతని తో ఎవరూ అసలు మాట్లాడటం లేదు అని అందుకే అతను చాలా బాధ పడుతున్నాడు అని అన్నారు. ఈ తరుణంలో అతని స్నేహితుడు ఒకరు ఇటీవల ఒక ఇంటర్వ్యు లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసాడు. సుశాంత్ మరణం తర్వాత జరిగిన పరిణామాలతో కరణ్ కుంగిపోయాడని ఆయన స్నేహితుడు చెప్పారు. 

 

కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కరణ్ మానసిక పరిస్థితి దారుణంగా ఉందని, ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదన్నారు. ఇక ఇప్పుడు కరణ్ విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అని కరోనా తగ్గిన తర్వాత ఆయన దాదాపుగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఇటీవల బన్సాలీ ని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. మరి కొంత మందిని కూడా విచారించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: