మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుంచి నటులే కాదు టెక్నీషియన్లు కూడా వచ్చారని నిరూపించింది ఆయన ముద్దుల తనయ సుస్మిత. చిరంజీవికి.. శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి వరుసగా సైరా.. నరసింహారెడ్డి వరకూ సుస్మితే డ్రెస్ డిజైన్ చేస్తోంది. ఇప్పుడు సుస్మిత స్టైలింగే కాకుండా కొత్తగా వెబ్ సిరీస్ లోకి కూడా ఎంటర్ అవుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో రౌండ్ అవుతోంది. ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న డిజిటిల్ మీడియా వైపు సుస్మిత అడుగులు వేస్తోందట. ఇప్పటి ఓ వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసిందని సమాచారం.

IHG

 

సిద్ధార్ద్ – షామిలి జంటగా 2009లో వచ్చిన ‘ఓయ్’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ రంగా దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తీస్తున్నట్టు తెలుస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ‘ఎక్సేంజ్ ఆఫ్ ఫైర్‘ పేరుతో ఈ వెబ్ సిరీస్ తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇది పోలిస్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందని తెలుస్తోంది. పూర్తిగా కొత్తవాళ్లతోనే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ దశలో ఉందని తెలుస్తోంది. దీనిపై పూర్తి అఫిషియల్ వివరాలు సుస్మిత నుంచి రివీల్ కావాల్సి ఉంది.

IHG's Random Thoughts - TeluguMirchi.com

 

ఆనంద్ రంగా ‘ఓయ్’ తర్వాత మళ్లీ ఏ సినిమాకు దర్శకత్వం వహించ లేదు. వెబ్ సిరిస్ తో అయినా ఆనంద్ రంగా ఆకట్టుకుంటాడేమో చూడాలి. సుస్మిత గతంలోనే వెబ్ సిరీస్ కు ప్లాన్ చేస్తోందని వార్తలు వచ్చాయి. తండ్రి చిరంజీవితోనే తెరకెక్కిస్తుందని గాసిప్స్ రౌండ్ అయ్యాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ను ఓ క్రేజీ డిజిటల్ మీడియాతో అసోసియేట్ అయి తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఆనంద్ రంగా గతంతోనే సందీప్ కిషన్ తో డీకే బోస్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: