టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ముందు నుంచి ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ సినిమా అనగానే మొదటి రోజు చూడాలి అనుకునే బ్యాచ్ కూడా మనకు చాలా మందే కనపడుతూ ఉంటారు. ఆ విధంగా మహేష్ బాబు తనకంటూ ఒక రేంజ్ లో పేరు సంపాదించాడు అనే చెప్పాలి. ఇప్పుడు మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో కాకుండా కాస్త తక్కువ బడ్జెట్ తోనే తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించి ఇప్పుడు మహేష్ టీం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అనే ప్రచారం జరుగుతుంది. సినిమాలో హీరోయిన్ ని మార్చే ఆలోచనలో ఉన్నారట. ముందు కైరా అద్వానీని అనుకున్నారు. ఆ తర్వాత కీర్తి సురేష్ ని అనుకున్నారు. కాని కీర్తి మాత్రం కాస్త టైం పట్టే అవకాశం ఉంది అని చెప్పడం తో ఆమె కాదు మరొకరు అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ వైపు మహేష్ టీం చూస్తుంది అని టాక్ వస్తుంది. బాలీవుడ్ లో చాలా వరకు కూడా కొందరు హీరోయిన్ లు ఇప్పుడు తెలుగు మార్కెట్ కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

అగ్ర హీరోల సినిమాల్లో చేయడానికి గానూ వారు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక అందుకే మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా కావడం తో బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడు అని టాక్. దీనికి మహేష్ టీం కూడా ఓకే చెప్పింది అని సినిమా యూనిట్ కూడా అందుకు రెడీ అయింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: